31/05/2026
రాణీ అహిల్యాబాయి హోల్కర్ జయంతి 31 మే :
భారతదేశ నారీమణులలో పిల్లలను పెంచడంలో జిజియాబాయి (ఛత్రపతి శివాజీ తల్లి), వీరత్వానికీ ధీరత్వానికీ ఝాన్సీ రాణీ లక్ష్మీబాయిలను ప్రముఖంగా పేర్కొంటారు.
అలాగే కర్తవ్య నిష్ఠకు, ధార్మికతకు, ఆదర్శ పరిపాలనకు రాణీ అహిల్యాబాయి హోల్కర్ను ఆదర్శంగా చెప్పుకోవచ్చు. 1725 మే 31న
మహారాష్ట్రలో అహిల్యాబాయి జన్మించారు. ఆత్మవిశ్వాసం, భయరాహిత్యం ఉన్న మహిళ. ఈ లక్షణాలే సాధారణ కుటుంబానికి చెందిన అహిల్యాబాయిని ఇండోర్ రాజ వంశానికి కోడల్ని చేశాయి. ఇండోర్ రాజ్యాన్ని పరిపాలిస్తున్న మామగారు మలహరి రావు ద్వారా యుద్ధ విద్యలు, పరిపాలన మెలకువలు, రాజనీతి లాంటి విషయాల్లో తర్ఫీదు పొందారు. చిన్న వయసు నుండే రాజ్య పరిపాలనలో మామగారికి సహాయంగా ఉండేది. తన జీవితకా
లంలో మామగారు, భర్త, అత్తగారు, కుమారుడు, మనవడు, అల్లుడు... ఇలా వరుసగా ఎనిమిది మంది ఆప్తులను పోగొట్టుకున్నారు. అయినప్పటికీ అన్ని బాధలను ఓర్చుకొని మొక్కవోని ధైర్యంతో పరిపాలన చేసింది.
రాణీ అహిల్యాబాయి 300 ఏళ్ల క్రితమే తన కూతురికి అధికారికంగా కులాంతర వివాహం
చేసిన గొప్ప సాంఘిక సంస్కర్త ఆమె. స్త్రీలతో ప్రత్యేక సైనిక దళాన్ని ఏర్పరిచిన ఘనత ఆమెకే దక్కింది. బ్రిటిష్ వాళ్లు మందుగుండు సామగ్రితోనే దేశాన్ని ఆక్రమించుకుంటున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గ్వాలియర్ వద్ద భారత దేశంలోనే మొదటిసారిగా మర ఫిరంగులు, ఫిరంగి గుండ్లు వంటి వాటి తయారీ కర్మా గారం నెలకొల్పింది. వరకట్న నిషేధం, స్త్రీలకు ఆస్తి హక్కు, విద్యాభ్యాసం వంటి అనేక
సాంఘిక సంస్కరణలను తన రాజ్యంలో ప్రవేశపెట్టిన ఘనత అహిల్యాబాయిదే. ఎంతో ప్రాముఖ్యం పొందిన 'మహేశ్వరి చీరలు' నాడు అహిల్యాబాయి ప్రోత్సాహంతోనే మహేశ్వరంలో ఉత్పత్తి అయ్యాయి.
ఆమె హిందూ దేవాలయాల నిర్మాణంలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ప్రజల
వారణాసి, సోమనాథ్, బదరి, గంగోత్రి, శ్రీశైలం, రామేశ్వరం, కేదార్నాథ్ వంటి చోట్ల గుడులు, గోపురాలను పునర్నిర్మించారు. 1795 ఆగస్టు 13న 70 ఏళ్ల వయసులో రాణీ అహిల్యా బాయి స్వర్గస్థురాలయ్యింది. ఆమె త్రిశతాబ్ది జన్మదిన ఉత్సవాల సందర్భంగా కేంద్రం, అనేక రాష్ట్ర ప్రభుత్వాలూ విద్యాసంస్థలలో ఆమెపై సదస్సులు, సమావేశాలు నిర్వహించడం ఎంతైనా సముచితంగా ఉంది.

30/05/2026
29/05/2026
29/05/2026
29/05/2026
28/05/2026
28/05/2026