06/04/2026
భారత్ మాతాకీ జై 🚩
ఈరోజు భారతీయ జనతా పార్టీ బాచుపల్లి శాఖ (నిజాంపేట్ సర్కిల్) ఆధ్వర్యంలో, బాచుపల్లి అధ్యక్షుడు ప్రసాద్ రాజు గారి అధ్యక్షతన ఎస్.ఎల్.జి సర్కిల్ వద్ద భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో బాచుపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మిఠాయిలు పంచుకుంటూ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లి మాధవి గారు పాల్గొని మాట్లాడుతూ:
“ఈరోజు మనం గర్వంగా జరుపుకుంటున్నది భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం. 1980 ఏప్రిల్ 6న స్థాపించబడిన ఈ పార్టీ భారతదేశ అభివృద్ధి, జాతీయత, సాంస్కృతిక విలువలను కాపాడే లక్ష్యంతో ఏర్పడింది.
ఈ పార్టీ ఆలోచనా ధోరణికి ప్రేరణగా నిలిచిన మహనీయులు శ్యామ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాల్ వంటి మహానుభావుల సిద్ధాంతాలు మనకు మార్గదర్శకంగా ఉన్నాయి. అలాగే అటల్ బిహారీ వాజపేయి మరియు ఎల్.కే. అద్వానీ వంటి మహానేతలు పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేసి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచారు.
ప్రస్తుతం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్’ అనే భావనతో దేశ అభివృద్ధి కోసం పార్టీ నిరంతరం పనిచేస్తోంది.
అంత్యోదయ సిద్ధాంతంతో సమాజంలో చివరి వరుసలో ఉన్న వ్యక్తి వరకు అభివృద్ధి చేరాలనే సంకల్పంతో కోట్లాది కార్యకర్తలతో భారత మాత సేవలో ఈ పార్టీ ముందుకు సాగుతోంది. సాధారణ కార్యకర్త నుండి జాతీయ నాయకుల వరకు అందరి కృషితో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా ఎదిగింది” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాచుపల్లి ప్రోగ్రాం కన్వీనర్ రేపన్ కాశి, సుమన్, నారాయణమూర్తి, గోపతి సురేష్, ఉదయ్ కిరణ్, సాయి కృష్ణారెడ్డి, కాసాని సంతోష్, భార్గవి రెడ్డి, భూపాల్ రెడ్డి, హరిత, లోకేష్, భరత్, వంశీ, రాము, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ధన్యవాదాలతో
భారతీయ జనతా పార్టీ
బాచుపల్లి శాఖ – నిజాంపేట్ సర్కిల్

06/04/2026
05/04/2026
05/04/2026
30/03/2026
27/03/2026