06/03/2026
పరిశుభ్రమైన పట్టణాల దిశగా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక
జగిత్యాల పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని శాసన సభ్యులు డా. సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతిజ్ఞ చేశారు.
ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ 99 రోజుల ప్రణాళిక ద్వారా పట్టణాల్లో పరిశుభ్రతను పెంపొందించడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం మరియు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం లక్ష్యమని తెలిపారు. ప్రజలు చెత్తను తడి-పొడి వేరు చేసి ఇవ్వడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, సకాలంలో పన్నులు చెల్లించడం ద్వారా మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ పరిశుభ్రమైన పట్టణం ప్రజల సహకారంతోనే సాధ్యమని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకూడదని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు కలిసి పనిచేస్తే కార్యక్రమం విజయవంతమవుతుందని తెలిపారు.
మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణాన్ని పరిశుభ్రమైన పట్టణంగా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన పుర సేవలు, మౌలిక సదుపాయాలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
ఈ సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించి పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజా గౌడ్, RDO మధుసూదన్, కమిషనర్ స్పందన, కౌన్సిలర్లు పంబాల సుజాత రాము, బడుగు పద్మ రాజేందర్, బోల్లరపు స్వప్న గిరిధర్, దుమాల రాజ్ కుమార్, మొహమ్మద్ ఆయుబ్ ఖాన్, తోపారపు లావణ్య రజనీకాంత్, క్యాదాసు నవీన్, కూతురు శేఖర్, మానపురి పవిత్ర మహేష్, శ్రీనివాస్, ఖాజా కమలుద్దిన్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, అర్పిలు, మహిళా సంఘాల సభ్యులు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

02/03/2026
02/03/2026
01/03/2026