Best Online ID

Best Online ID

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Best Online ID, Political organisation, telangana, Telangana.

15/02/2024

ప్రచురణార్థం/ ప్రసారార్థం

ఢిల్లీలో రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడానికి ఖండించండి

దేశానికి అన్నం పెట్టే రైతులపై మోడీ ప్రభుత్వం చేస్తున్న విషప్రయోగం చేయడం చాలా దుర్మార్గం చర్య

*డివైఎఫ్ఐ ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి శీలం వీరబాబు*

ఖమ్మం త్రీ టౌన్/ ఢిల్లీలో ప్రశాంతంగా రైతులు గిట్టుబాటు ధర కావాలని రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ధర్నా చేస్తున్న రైతులపై కేంద్ర బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం భాష్పావాయువు లాఠీఛార్జి చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులు ముక్తికంఠంతో ఖండించాలని డివైఎఫ్ఐ ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి శీలం వీరబాబు తెలిపారు
ఖమ్మం త్రీ టౌన్ లో ఒక ప్రకటన విడుదల చేస్తూ మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో రైతుల సమస్యలు పరిష్కరించాలని గిట్టుబాటు ధర కల్పించాలని ఎరువుల రేట్లు తగ్గించాలని చాలా ప్రజాస్వామ్యం యుతంగా ధర్నా చేస్తున్న రైతుల పైన మోడీ ప్రభుత్వం చాలా నిరంకుశంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు రైతులపై లాఠీచార్జి చేస్తూ ముల్లకంచెలతో దాడులు చేసిందని తక్షణమే రైతులపై లాఠీచార్జి ఆపాలని రైతులకి కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు

Photos from Best Online ID's post 15/02/2024

*ప్రచురణార్థం*/ *ప్రసారార్థం*

*సార్వత్రిక బంద్ కు డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు*

*కేంద్ర బిజెపి ప్రభుత్వం మతతత్వ కార్పొరేట్ విధానాలు వ్యతిరేకించండి*

*నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఓడించండి*

*డివైఎఫ్ఐ ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి శీలం వీరబాబు పిలుపు*

*ఖమ్మం త్రీ టౌన్*/ *కేంద్ర బిజెపి ప్రభుత్వం మతతత్వ కార్పొరేట్ విధానాలు వ్యతిరేకిస్తూ శుక్రవారం జరిగే సార్వత్రిక బంద్ కు డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈ బంద్ లో నిరుద్యోగ యువత అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని డివైఎఫ్ఐ ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి శీలం వీరబాబు పిలుపునిచ్చారు*
*స్థానిక బుడిగం కృష్ణమూర్తి భవనంలో డివైఎఫ్ఐ త్రీ టౌన్ అధ్యక్షుడు సారంగి పాపారావు అధ్యక్షతన త్రీ టౌన్ కార్యదర్శి వర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో డివైఎఫ్ఐ ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి శీలం వీరబాబు మాట్లాడుతూ బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ పది సంవత్సరాలు కాలంలో ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగుల ని మోసం చేసిందని అదేవిధంగా ఉన్న ఉద్యోగాలు కూడా ఊడగొట్టిందని ఆయన ఆరోపించారు దేశంలో ఇప్పటివరకు ఎన్నడు లేని విధంగా నిరుద్యోగం బాగా పెరిగిందని ఆయన తెలిపారు దేశంలో ఒకపక్క నిరుద్యోగం పెరుగుతూ ఉంటే మరోపక్క ధరలు విపరీతంగా పెంచి ప్రజల పైన భారాలు వేస్తూ పెద్దపెద్ద కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చే విధంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన విమర్శించారు ఈ విధానాలన్నీ దేశ ప్రజలు వ్యతిరేకించాలని శుక్రవారం జరిగి సార్వత్రిక బంద్ లో యావత్ ప్రజానీకం నిరుద్యోగులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు*
*ఈ సమావేశంలో డివైఎఫ్ఐ త్రీ టౌన్ ఉపాధ్యక్షుడు యర్రా నాగేష్ ,యర్రా సాయి, కీత యశ్వంత్, ఎస్ కే పాషా, సోమయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు*

Photos from Best Online ID's post 13/02/2024

ఈనెల 16న దేశవ్యాప్తంగా జరిగే గ్రామీణ బంద్ ని జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు ఖమ్మం త్రీ టౌన్ వ్యవసాయ మార్కెట్లో బంద్ ప్రచార , సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు రాష్ట్ర నాయకులు యర్రా శ్రీకాంత్ గారు మాట్లాడుతూ ఈనెల 16వ తారీఖున జరిగే గ్రామీణ బంద్ లో ప్రతి ఒక్కరి పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు దేశంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టే దానికోసం ఈ బంద్ నిర్వహిస్తున్నామని దీనిలో సకల ప్రజానికం పాల్గొని జయప్రదం చేయాల్సిన బాధ్యత ఉందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు ఐద్వా త్రీ టౌన్ కార్యదర్శి శ్రీ పత్తిపాక నాగ సులోచన డివైఎఫ్ఐ ఖమ్మం త్రీ టౌన్ కార్యదర్శి శీలం వీరబాబు, దడవాయిలు నరసింహారావు, సాయి, సిఐటియు నాయకులు కొట్టి అలివేలు, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు

Photos from Best Online ID's post 13/01/2024

కూలిపోయిన గ్రంథాలయాన్ని పరిశీలించిన సిపిఎం జిల్లా నాయకత్వం
గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం ఈ దుస్థితి
3 ఏండ్ల క్రితమే శిథిలావస్థలో ఉందని తేల్చిన అధికారులు
జాగ్రత్తలు పాటించక మట్టిపాలైన అనేక చారిత్రక పుస్తకాలు

- సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్‌

ఖమ్మం, జనవరి 13, 2024 (శనివారం):` శుక్రవారం రాత్రి కూలిపోయిన జిల్లా గ్రంథాలయ భవనాన్ని సిపిఎం జిల్లా నాయకత్వం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటి సభ్యులు యర్రా శ్రీకాంత్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా జిల్లా గ్రంథాలయానికి ఈ దుస్థితి వచ్చిందని విమర్శించారు. గత 3 ఏండ్ల క్రితం ఈ గ్రంథాలయం భవనాన్ని పరిశీలించి కూలిపోతుందని అధికారులు తేల్చారని పేర్కొన్నారు. అయినా జాగ్రత్తలు తీసుకోకుండా కనీసం విలువైన పుస్తకాలను భద్రపర్చకుండా గ్రంథాలయ కమిటి అధికారులు నిర్లక్ష్యం వహించారన్నారు. ఈ ప్రమాదం సెలవు రోజు జరగటం వలన పెను ప్రమాదం తప్పిందని లేకుంటే ఉద్యోగులు, రీడర్స్‌కు ప్రాణాపాయం జరిగి ఉండేదని అన్నారు. అనేక విలువైన పుస్తకాలు నేలమట్టమైనాయని పేర్కొన్నారు. ఈ నష్టానికి ప్రభుత్వం, అధికారులు బాధ్యత వహించాలని, జిల్లా ప్రజలకు అందుబాటులోకి తక్షణమే నూతన భవనం నిర్మించాలని డిమాండ్‌ చేశారు.
సందర్శించిన వారిలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, చింతలచెర్వు కోటేశ్వరరావు, భూక్యా వీరభద్రం, జిల్లా నాయకులు మాదినేని రమేష్‌, తుశాకుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

10/01/2024

కారేపల్లి సిపిఎం పార్టీ కార్యాలయం పై ఫారెస్ట్ అధికారుల దాడి ఎర్రబోడు మాణిక్యారం పోడు భూమి జిల్లా l సాగుదారులు సమావేశం అయితే అక్రమ అరెస్టు చేయటానికి సిపిఎం కార్యాలయంపై దాడి చేయడం వచ్చారు 70. 60 సంవత్సరాల సాగు చేసుకుంటున్న భూమిని అక్రమంగా ఫారెస్ట్ వల్ల అక్రమించారు. తరువాత వేరే భూమి ఇస్తామని చెప్పి ఫారెస్ట్ అధికారులు భూమి ఇవ్వకుండా 5 సంవత్సరాల నుండి భూమి చూపించడం లేదు. అటవీగిరిజనులు గిరిజనులు ఎస్సీలు బీసీలు మరి మమ్మల్ని పైనుంచి మాట్లాడు మీదికి వెళ్లారు ఆగు చేసుకుంటున్నారు దాడి చేసి వారిపై అక్రమ కేసులు పెట్టారు దీనిని సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సంఘం రైతు సంఘాలు ఖండిస్తున్నాయి. ఇంకా పోలీస్ ఫారెస్ట్ అధికారులు సిపిఎం పార్టీ ఆఫీస్ ముందు బెటాయించారు నిర్వహిస్తున్నారు. ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది,
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా కార్యదర్శి యర్రా శ్రీకాంత్ జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యవీరభద్రం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర శ్రీనివాసరావు కొండెబోయిన నాగేశ్వరరావు మండల కార్యదర్శి నరేందర్ వజ్జా రామారావు తలారి దేవ ప్రకాష్ దాసరి మల్లయ్య కాంగ్రెస్ నాయకులు తిమ్మరి తిరుపతిరావు దారావత్ బద్రు చల్లా కృష్ణ భీముడు పోడు పోరాట మహిళలు మల్లమ్మ అరుణ తదితరులు ఉన్నారు

09/01/2024
02/12/2023

✊ *కామ్రేడ్స్ అందరికీ రెడ్ సెల్యూట్* ✊

అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం సిపిఎం పార్టీ గెలుపు కోసం కృషిచేసిన *రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ పార్టీ సభ్యులు, సానుభూతిపరులందరికి ప్రత్యేక అభినందనలు* తెలియజేస్తున్నాను, బూర్జువా పార్టీలు ప్రజలను అనేక రూపాల్లో ప్రలోభాలకు గురిచేసిన, _సిపిఎం ఓటర్లను నిలబెట్టెందుకు ,శక్తికి మించి కృషిచేసిన పార్టీ నగర డివిజన్ ,గ్రామ, మండల కమిటీలు, నాయకులు , కార్యకర్తలు, పోలింగ్ బూత్ లో పార్టీ తరఫున కూర్చున్న ఏజెంట్లకు_సిపిఎం పార్టీకి ఓట్లు వేసిన ప్రజలకు
*విప్లవ అభివందనాలు*

.. 💐 *అభినందనలతో* 🌹
యర్రా శ్రీకాంత్
_సిపిఎం ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి_

28/11/2023

30వ తారీకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం సిపిఎం అభ్యర్థి యర్రా శ్రీకాంత్ గారిని సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరు

Want your business to be the top-listed Government Service in Telangana?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address

Telangana
Telangana