02/07/2026
వైయస్సార్, జగన్ గారు తిరుమలకు చేసింది ఇది – మరి చంద్రబాబు ఏం చేశారు?
తిరుమల లాంటి పవిత్ర క్షేత్రాన్ని రాజకీయానికి వాడుకునే గుంపు రాష్ట్రంలో ఈ మధ్య ఎక్కువైపోయింది. కానీ నిజానికి వాళ్లు తిరుమలకు ఎమైనా మేలు చేశారా అంటే శూన్యం. వైయస్సార్ పై, జగన్పై నిత్యం నిందలు మోపుతూ మత రాజకీయాల ద్వారా స్వలాభం పొందుదామని నిచమైన ఆలోచన చేస్తున్న ఈ గుంపు కుట్రలను ప్రజలు అప్రమత్తంగా ఉండి నిజాలను తెలుసుకుని… మన తిరుమల ప్రతిష్టను మనమే కాపాడుకోవాలి.
ముందుగా చెప్పుకోవాలి అంటే వైయస్సార్ గారు అధికారంలోకి రాగానే తిరుమల కొండలపై వివాదం లేపారు.
కానీ ఆ వివాదం కూడా రాజకీయ స్వలాభం కోసం చేసినదే అని అప్పుడే తేలిపోయింది.
✔ వైయస్సార్ హయాంలో తిరుమల ప్రతిష్ట మరింత పెరగడానికి చేసిన ముఖ్య పనులు.
• 2007 జూన్ 2న వైయస్ తిరుమల ఏడు కొండలు, ఇంకా రాష్ట్రంలో 19 ప్రధాన ఆలయాల దగ్గర అన్యమత ప్రచారం జరగకుండా ఆర్డినెన్స్ పాస్ చేశారు. ఇంత ధైర్యంగా ఆర్డినెన్స్ బీజేపీ పాలిత రాష్ట్రాలకు కూడా ఇచ్చిన చరిత్ర ఇప్పటికీ లేదు.
• వైయస్ నిరాధరణకు గురైన తరిగొండ లక్ష్మీ నరసింహ దేవాలయం, జమ్మలమడుగు నరపుర వెంకటేశ్వర స్వామి దేవాలయం, కడప గండి ఆంజనేయ దేవాలయం, నగరి వరద రాజ దేవాలయం, కొసువారిపల్లి ప్రసన్న వెంకటరమణ స్వామి దేవాలయం, తొండమనాడు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయాలను టీటీడీ కింద చేర్చి పునరుద్ధరించారు.
• వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 100 కోట్లతో శ్రీవారి ఆనందనిలయాన్ని స్వర్ణమయం చేశారు.
(ఇక్కడ విమాన వెంకటేశ్వరుడు ఉండడంతో దీనిని విమాన ప్రాకారం అని కూడా అంటారు.)
• “కళ్యాణమస్తు” పథకం ద్వారా పేదలకు తిరుమలలో సామూహిక వివాహాలు జరిపించడం, వెంటనే దర్శనం సదుపాయం కల్పించడం చేశారు.
• అవసరాల కోసం మతం మార్చుకున్నవారిని తిరిగి హిందూమతంలోకి తీసుకురావడం కోసం “దళిత గోవిందం” కార్యక్రమం నిర్వహణ.
• దళితవాడల్లో రామాలయాలు నిర్మించుకునేవారికి ప్రభుత్వం తరఫున ₹1,00,000 మంజూరు చేశారు.
• పూజారులు–పండితులకు “ఆయుష్మాన్ భవ” ఇన్షూరెన్స్ స్కీమ్ ఇచ్చారు.
• వరుణ దేవుని అనుగ్రహం కొసం చెన్నై, హైదరాబాద్లో “సతకుండాత్మక హోమం” నిర్వహణ.
• జైళ్లలో ఉన్న ఖైదీలలో పరివర్తన రప్పించడం కోసం “గీతా గోవిందం” పేరిట ఉచితంగా భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేశారు.
• వేదాలను సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించడం వైయస్సార్ హయాములోనే జరిగింది.
• పేద విద్యార్థులకు “పద్మావతి అమ్మవారి పుస్తక ప్రసాదం” పథకం ప్రారంభించారు.
• చవిటి సమస్య ఉన్న పసిపిల్లల కోసం “శ్రవణం” పథకం ప్రారంభించారు.
• ట్ట్డ్ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు చేసింది వైయస్సార్.
• లడ్డూ తయారీ కార్మికులు, పూజారులు, పల్లకి మోయేవారికి వేతనాల పెంపు చేసింది వైయస్సార్.
• ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ వైయస్ తిరుమలలో ఎప్పుడూ ప్రోటోకాల్ వినియోగించలేదు;
సాధారణ భక్తులేలా క్యూలో వెళ్తారో అలా వెళ్లేవారు.
• అర్చకుల జీతాలు ₹3,000 నుంచి ₹10,000కి పెంపు.
• అర్చకుల కోసం ₹75 కోట్లు వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు.
• 24,000 దేవాలయాల్లో దూపదీప నైవేద్యం కోసం పెద్దఎత్తున నిధులు—మొదటి విడతగా 3,500 ఆలయాలకు పంచిణీ.
• 2008 ఏప్రిల్లో శ్రీవారికి 1.5 కేజీల బంగారు దండ సమర్పణ.
• తిరుమల కాలుష్యం రాకుండా 2009లో ప్లాస్టిక్ నిషేధం, లడ్డూ పవిత్రత కాపాడటానికి జీఐ ట్యాగ్ తెప్పించారు.
• 2008లో శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ ప్రారంభం – దీనిని చంద్రబాబు అసెంబ్లీలో వ్యతిరేకించారు.
✔ జగన్ హయాంలో చేసిన ముఖ్యమైన మార్పులు
• ప్రసాదాలు–లడ్డూల నాణ్యత పెంచేందుకు సీఎఫ్టీఆరై అనుసంధానం, అత్యాధునిక ల్యాబ్లు నిర్మాణం చేపట్టారు.
• “నవనీత సేవ” – శుద్ధ నెయ్యి కోసం ప్రత్యేక గోశాలలు నిర్మాణం చేపట్టారు.
• అర్చకుల జీతాల రెట్టింపు, పరకామణి నూతన అత్యాధునిక భవనంతో ఆధునీకరణ.
• టీటీడీ ఆలయాల నిర్మాణం – అమరావతి, విశాఖ, భువనేశ్వర్, హైదరాబాద్, జమ్మూ, చెన్నై, అమెరికా.
• టీటీడీ ఉద్యోగులకు 9,000 ఇళ్ల పట్టాలు.
• “శ్రీవాణి ట్రస్ట్” ద్వారా 2,500 దేవాలయాల నిర్మాణం – ఈ శ్రీవాణి ట్రస్ట్ ను చంద్రబాబు పూర్తిగా వ్యతిరేకించారు.
• మఠాధిపతులతో 3 సార్లు విద్వత్తు సదస్సులు – వీటిలో 1 సారి జగన్ హయాంలో. 2 సార్లు వైయస్సార్ పాలనలో చంద్రబాబు పాలనలో ఒక్కటీ లేదు.
✔ చంద్రబాబు హయాంలో చేసింది:-
• 2003లో తిరుమల ప్రధాన గోపురం ఎదురుగా ఉన్న చారిత్రాత్మక “వెయ్యి కళ్ల మండపం”ను కూల్చివేత.
(సాలువ మల్లదేవర మహారాజు 1464లో నిర్మించినది.)
• తిరుమలలో పంచాయతీ ఎన్నికలు జరగాలంటూ కోర్టులో కేసులు— NTR నియమించిన చెల్లా కొండయ్య కమిషన్ సిఫార్సులకు విరుద్ధంగా. తద్వార రెండు కోండలనే అబద్దపు ప్రచారానికి ఆజ్యం.
• ఎస్వీబీసీ ఛానల్ను అసెంబ్లీలో ప్రత్యక్షంగా వ్యతిరేకించడం.
• ఇప్పుడు లడ్డూలో జంతు కోవ్వు, కెమికల్స్, బాత్రూం క్లీనర్స్ అంటూ రోజుకో కొత్త అబద్దం, భక్తులను గందరగోళానికి గురిచేయడం. మనోభావలతో ఆడుకోవడం
వైయస్సార్ – జగన్ - చంద్రబాబు ముగ్గురు ఎవరు ఎలాంటి వారో స్వామి వారికి తెలుసు కాబట్టే ఒకే కుటుంబం నుంచి వరుసగా ఇద్దరిని సీఎం చేసిన అరుదైన గౌరవం కూడా శ్రీవారు ఇచ్చారు. అలాగే తండ్రీ కోడుకు చేత కూడా పట్టు వస్త్రాలు అధికార హోదాలో తెప్పించుకున్నారు. ఇది ఇపట్టికి ఎవరికి దక్కని అదౄష్టం స్వామి వారే వైయస్సార్ కుటుంభానికి ఇచ్చిన వరం ఇది.

09/22/2025
08/12/2025
06/28/2025