27/02/2026
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పుట్టు పూర్వోత్తరాలు చూస్తే ఈ ప్రాజెక్టుకు అన్నీ చంద్రబాబుగారే. 30 ఏళ్ళ క్రితం ప్రాజెక్టు కోసం శంకుస్థాపన చేసింది ఆయనే. ప్రాజెక్టు పనుల్లో 90 శాతం పూర్తి చేసింది ఆయనే. మిగతా పని పూర్తి చేసేది కూడా ఆయనే. ఐదేళ్ళలో కేవలం 5 శాతం పనులు చేసిన జగన్ కు వెలిగొండ గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది?
27/02/2026
• రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనివే, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ దశలవారీగా పూర్తి చేస్తాం ..అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో సీఎం చంద్రబాబు
• కల్తీ నెయ్యి పై చర్చకు వైసీపీ సభ్యులు ఎందుకు భయపడుతున్నారు? శాసనమండలిలో మార్చి 4న లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ..మంత్రి పయ్యావుల కేశవ్
• ఘటన జరిగాక కాదు, ముందే మేల్కొనాలి ..అతిసార,కల్తీపాల ఘటనలపై జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు
• 2027 గోదావరి పుష్కరాలను ఆరు జిల్లాల్లో మహా కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు 373 ఘాట్లు ఏర్పాటు. గోదావరి పుష్కరాలు పై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో పాల్గొన్న ఎనిమిది మంది మంత్రులు
• రాష్ట్రంలోని గ్రామ ,వార్డు సచివాలయాలకు "స్వర్ణ గ్రామం ", "స్వర్ణ వార్డు" గా పేర్ల మార్పు . మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/w483v
25/02/2026
వెలిగొండ ప్రాజెక్ట్.. మొదలు పెట్టింది ఆయనే.. పనులు చేసింది ఆయనే.. ఇప్పుడు పూర్తి చేస్తోంది కూడా ఆయనే..
వెలిగొండ ప్రాజెక్ట్ వాస్తవాలు ఈ థ్రెడ్లో చూడొచ్చు..
https://x.com/JaiTDP/status/1750085350607978641
జూన్ 2024 నాటికి పెండింగ్లో ఉన్న పనులు ఇక్కడ చూడొచ్చు... ఇన్ని పనులు చేయకుండా, “జాతికి అంకితం” అనే డ్రామా:
https://x.com/JaiTDP/status/2016907289769496663
25/02/2026
• హిందూ మనోభావాలను కాపాడే బాధ్యత మాది..కల్తీకి ఆస్కారం లేకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తాం. - సీఎం చంద్రబాబు
• ఆంధ్రప్రదేశ్ లో “సైన్స్ అండ్ టెక్నాలజీ & ఇన్నోవేషన్” పేరుతో కొత్త శాఖ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం.
• రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పనితీరును ప్రశంసించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
• హెరిటేజ్ సంస్థ నీతి, నిజాయితీతో నిలబడింది. హెరిటేజ్ ఎప్పుడూ తప్పు పనులు చేయదు.- సీఎం చంద్రబాబు
•భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటం అత్యంత తీవ్రమైన నేరం.- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
•18 నెలల్లోనే 16 వేల మంది ఉపాధ్యాయులను నియమించాం. ప్రతి ఏడాది రిటైర్మెంట్లను పరిగణనలోకి తీసుకుని ఏటా ‘డీఎస్సీ’ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నాం. - మంత్రి నారా లోకేష్
•ప్రైవేటు కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. - మంత్రి నారా లోకేష్
• మహిళలు, చిన్నారుల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఆడపిల్లల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుంది. - హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/XTDnZ
24/02/2026
• ఎస్సీ, ఎస్టీ , బిసీ మైనారిటీలకు గతానికంటే ఎక్కువ కేటాయింపులు.. సంక్షేమానికి బడ్జెట్లో కేటాయింపులపై శాసనసభలో సీఎం చంద్రబాబు
• తాగునీటి శాంపిళ్ల పరీక్షలకు మొబైల్ ల్యాబ్ లు అందుబాటులోకి తేవాలి.. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్షలో సీఎం చంద్రబాబు
• కల్తీ పాల ఘటనపై నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.. శాసనసభలో ప్రకటించిన సీఎం చంద్రబాబు
• ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ విడుదలకు కసరత్తు చేస్తున్నాం.. అసెంబ్లీలో స్పష్టం చేసిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ కి సంబంధించిన వాస్తవాలను అసెంబ్లీలో ప్రవేశపెడతాం.. ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/oxxaz
23/02/2026
• 5 లక్షల ఇళ్లకు ఫైబర్ కనెక్షన్లు ఇచ్చే లక్ష్యంతో ఏపీలో అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్స్. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో ఎంఓసీ.
• కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ పార్సిల్ వెళ్లాలంటే డాక్ సేవకుల వల్లే సాధ్యం. వారికి ఎలక్ట్రిక్ సైకిళ్ళు ఇచ్చి మరింత ప్రోత్సహించాలి.. గుంటూరులో గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనంలో సీఎం చంద్రబాబు
• 18 నెలల్లో ఏ ఒక్క సారీ శ్రీవారిని దర్శించని జగన్ రెడ్డికి తిరుమల ఊసెత్తే అర్హత లేదు.. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
• పరకామణి నుంచి కల్తీ నెయ్యి దాకా తిరుమల పవిత్రతను దెబ్బతీసిన జగన్ రెడ్డికి హిందూమతంపై గౌరవం లేదు.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
• వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమం పై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమగ్రంగా చర్చించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి.
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/TRiTq
21/02/2026
పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. స్వచ్ఛరథాలను సీఎం ప్రారంభించారు. ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.