12/12/2025
నమస్తే ఈరోజు ఉదయం బాగ్ అంబర్ పేట్ సత్యసాయి విద్య విహార పాఠశాలలో
దేశ స్వాతంత్రాకి ఉవ్వెత్తున దోహద పడినటువంటి శ్రీ బంకించంద్రచటోపాధ్యాయ గారు రచించిన వందేమాతర గేయాన్ని దేశవ్యాప్తంగా బ్రహ్మాస్త్రంగా మారి స్వాతంత్రోద్యమంలో ప్రతినోటా వందేమాతరంతో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ బాగ్ అంబర్పేట్ డివిజన్ అధ్యక్షులు
#పినాగరాజు చారి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం సత్య సాయి విద్యా విహార పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి
.పద్మజ గారు మరియు P T E
#శ్రీ శ్రీనివాస్ గార్లను వారి సహకారంతోటి కార్యక్రమం చేయడం జరిగింది వందేమాతరం పూర్తి గేయాన్ని పాడించి విద్యార్థులకు వందేమాతర గీతం పట్ల అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బిజెపి కార్యదర్శి
#డాక్టర్ N. గౌతమ్ రావు గారు బిజెపి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి
#ఏడెల్లి అజయ్ కుమార్ గారు విచ్చేసి వందేమాతర గీత విశిష్టతను వివరించారు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు గారు మాట్లాడుతూ వందేమాతరం స్వాతంత్ర ఉద్యమంలో ఏ రకంగా ఆయుధంగా మారిందో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏ రకంగా కూలదోయడం జరిగిందో నేటి విద్యార్థులు తెలుసుకోవాల్సిన అటువంటి అవశ్యకత ఎంతైనా ఉందని ఆ రోజుల్లో వందేమాతర గేయాన్ని రచించి ప్రజల్లోకి తీసుకెళ్లిన శ్రీ బంకిం చంద్ర చటోపాధ్యాయ గారిని 150 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వందేమాతర గేయం మనం స్కూల్లో పాడుతున్నటువంటి సగం గేయమే కాకుండా వారు రచించిన పూర్తి గేయాన్ని ప్రతి విద్యార్థి ప్రతి పౌరుడు తెలుసుకొని నేర్చుకోవాల్సిన అవసరం ఉందని వారు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డివిజన్ వందేమాతర కమిటీ సభ్యులు పి. గోవర్ధన్ రెడ్డి,
ఈ.ఎస్ ధనంజయ, కెOచే చంద్రశేఖర్, పుట్ట పాండురంగయ్య, రఘునందన్, దండు భాస్కర్, కే ప్రవీణ్ కుమార్, ఏడెల్లి బాలు ఈ.యోగేష్ గౌడ్ రామ్ రెడ్డి, శివ, విజయందర్ రెడ్డి కనక లక్ష్మి ,సురేష్, రఘు చారి, అనిల్, మహేష్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

07/12/2025
20/02/2023
05/02/2023
11/01/2023
30/11/2022