09/07/2022
Human rights protection force and legal services aid council !!
We HRPFLSC ,our council strive for human rights protection and helps people for legal services aid and registered under Govt of India under section 8!!
09/07/2022
Human rights protection force and legal services aid council !!
13/06/2022
Sergeant Prakash Ghosh of Kolkata's Southeast Traffic Guard is winning hearts online after a photo of him teaching a small boy on the roadside started going viral on the internet.
In an accompanying post, Kolkata Police shared that Mr Ghosh, who is often on duty near Ballygunge ITI in south Kolkata, started speaking to the eight-year-old boy's mother, who works at a food stall nearby.
She told the cop that they are homeless and that she had done everything she could to enroll her son into a government school but her dream couldn't materialise.
So, Mr Ghosh took it upon himself to help her son. He now keeps an eye on the kid and teaches him while performing his duty.
11/06/2022
Don't share sensitive matter photos/videos in social media!!
10/06/2022
కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త చట్టాలను అమల్లోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే..ఇప్పుడు మరో కొత్త చట్టాన్ని అమల్లొకి తీసుకొని రానుంది.పాత లేబర్ చట్టాల స్థానంలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త కార్మిక చట్టాలను తేవాలని ఆలోచిస్తుంది.
కొత్త చట్టాలు అమల్లోకి వస్తే కార్యాలయ పని వేళలు, జీతం, ఉద్యోగుల భవిష్య నిధి (EPF) వంటి వాటిలో చాలా మార్పులు వస్తాయి. కొత్త సంస్కరణల ద్వారా లేబర్ కోడ్ వేతనాలు, సామాజిక భద్రత (పెన్షన్, గ్రాట్యుటీ), కార్మిక సంక్షేమం, ఆరోగ్యం, భద్రత, పని పరిస్థితులకు సంబంధించిన నిబంధనలు ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ కొత్త చట్టాలు జూలై 1 నుంచి వచ్చే అవకాశం ఉందని సమాచారం..
కొత్త కార్మిక చట్టంలోని అంశాలు..
1. కార్యాలయ పని వేళల్లో పూర్తిగా మారిపోతాయి.8-9 గంటల నుంచి 12 గంటలకు పెంచవచ్చు. ఉద్యోగులకు మూడు వీక్లీ ఆఫ్లు ఉండే అవకాశం ఉంది.
2. పరిశ్రమల్లో కార్మికులకు గరిష్ట ఓవర్టైమ్ 50 గంటల నుండి 125 గంటలకు పెరుగుతుంది.
3. ప్రాథమిక వేతనాన్ని స్థూల జీతంలో 50%గా ఉండవచ్చు. జీతాల పెరుగుదలలో మార్పులు వస్తాయి.
4. ఉద్యోగుల PF ఖాతాల్లో నగదు భారీగా పెరుగుతుంది.
5. పదవీ విరమణ తర్వాత వచ్చే డబ్బు, గ్రాట్యుటీ మొత్తం పెరగడం వలన ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత మెరుగైన జీవితాన్ని గడపగలుగుతారని ప్రభుత్వం యోచిస్తుంది.
6. సెలవుల అర్హత సంవత్సరంలో 240 రోజుల నుంచి 180 రోజులకు తగ్గుతుంది. అంటే ప్రతి 20 రోజుల పనికి 1 రోజు సెలవు ఉంటుంది..
ఈ కొత్త చట్టాల వలన ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని అంటున్నారు. వీలైనంత త్వరగా ఈ కోడ్ ను అమల్లొకి తీసుకురావాలని భావిస్తున్నారు.కొత్త కార్మిక చట్టాల వల్ల దేశంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది..
30/05/2022
Hrpflsc!
27/05/2022
మున్సిపల్ కార్మికురాలుగా మున్సిపల్ ఛైర్మన్ కూతురు!!
అవినీతి, రాజకీయ అండ!!
నెల నెలా జీతం🤦
24/05/2022
Need lawyers to form organization to provide legal services!
11/05/2022
మద్యం మత్తులో బండి నడిపితే జైలుకే....
10/05/2022
Fake profiles!!
Be careful!!
04/05/2022
CJI
30/04/2022
న్యాయవ్యవస్థ ఆదేశాలను కొన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.. కోర్టు ధిక్కరణ కేసులు పెరిగిపోతున్నాయి: సీజేఐ ఎన్వీరమణ
న్యాయవ్యవస్థ ఆదేశాలను కొన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, అందువల్ల దేశంలో కోర్టు ధిక్కరణ కేసులు పెరగిపోతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ (NV Ramana) ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకోసం కోర్టుల్లో సిబ్బందిని త్వరితగతిన నియమించాలని సీజేఐ సూచించారు. ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన్భవన్ వేదికగా జరిగిన హైకోర్టు సీజేలు, ముఖ్యమంత్రుల సంయుక్త సదస్సులో ఎన్వీ రమణ ఈ మాటలన్నారు. ప్రధాని నరేంద్రమోడీ (PM NarendraModi) ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సీజేఐ ఎన్వీరమణ.. ‘ న్యాయవ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థలు పరస్పర సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరముంది. ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికైన వారిని అందరూ గౌరవించాల్సిందే. అదేవిధంగా వార్డు సభ్యుడి నుంచి లోక్సభ సభ్యుడివరకు అందరూ న్యాయవ్యవస్థ ఆదేశాలను పాటించాల్సిందే. చట్టం అందరికీ సమానమే. అధికార వర్గం తన బాధ్యతలు సమర్థంగా, సక్రమంగా నిర్వహిస్తే కోర్టు కేసులు తగ్గిపోతాయి. అయితే కొన్ని ప్రభుత్వాలు కోర్టు ఆదేశౄలను పట్టించుకోవడం లేదు. ఫలితంగా కోర్టు ధిక్కరణ కేసులు పెరిగిపోతున్నాయి. పెండింగ్లో ఉన్న కేసుల్లో 66 శాతం భూతగాదాలవే. అలాగే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు పూర్తి నిరుపయోగంగా మారుతున్నాయి. దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. దేశంలో ప్రతి 10 లక్షల మంది జనాభాకు కేవలం 20 మంది న్యాయమూర్తులే ఉంటున్నారు. ఫలితంగా కోర్టు్ల్లో పెండింగ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కేసుల పరిష్కారం కోసం కిందిస్థాయి కోర్టు్ల్లో మరింత మంది సిబ్బందిని త్వరితగతిన నియమించాలి’ అని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు.