21/04/2025
టాటా ఎఐఎ లైఫ్ ఇన్సూరెన్స్: నామినీకి రూ. 6 లక్షల క్లెయిమ్ చెక్కు అందజేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ :
హైదరాబాద్, ఏప్రిల్ 21, 2025:
టాటా ఎఐఎ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజుర తాలూకా ముండి గేట్ గ్రామానికి చెందిన దివంగత భానోత్ కిషన్ గారి భార్య నామినీ భానోతు జ్యోతికి రూ. 6 లక్షల క్లెయిమ్ చెక్కును హైదరాబాద్లో నిర్వహించిన ఏజెంట్ల సమావేశంలో మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి ద్వారా నామినీకి అందించారు.
భానోత్ కిషన్ గారు కాగజ్నగర్కు చెందిన ఏజెంట్ గుగులోత్ రజిత ద్వారా జనవరి నెలలో టాటా ఎఐఎ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నారు.
సంవత్సరానికి రూ. 50,000 చెల్లించే ఈ పాలసీ కింద ఒక కిస్తు చెల్లించిన కొన్ని నెలలకే, హార్ట్ ఎటాక్ కారణంగా ఆయన అకాల మరణం చెందారు.
సమావేశంలో మాట్లాడుతూ, డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ జీవిత బీమా యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేశారు.
*"ప్రతి ఒక్కరూ టర్మ్ పాలసీ తీసుకొని తమ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలి. ఇన్సూరెన్స్ ద్వారా కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించడం మన లక్ష్యం,"* అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ శ్యామ్ రావు, మేనేజర్ నున్న మురళి, సీనియర్ బిజినెస్ అసోసియేట్ కందికంటి విజయ్ కుమార్, చీఫ్ బిజినెస్ అసోసియేట్ శ్రీధర్ మాల్యల, బిజినెస్ అసోసియేట్ లీడర్లు ఎర్రమంజుల మహేష్, కొంగరి అరుణ, కొంకటి శేఖర్, బోనగిరి ప్రభాకర్, యాపచెట్టు యాదగిరి, ఏజెంట్ గుగులోత్ రజిత, రాజేందర్ గారు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం టాటా ఎఐఎ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క నిబద్ధతను మరియు త్వరగా క్లెయిమ్ సెటిల్మెంట్లో సేవలను ప్రదర్శించింది, కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం అందించే లక్ష్యాన్ని బలపరుస్తుందని కందికంటి విజయ్ కుమార్ తెలిపారు.
RS Praveen Kumar Kandikanti Vijay Kumar
06/07/2024
👉🏻 ఆర్ఎస్పీ దెబ్బకు దిగొచ్చి గురుకులాలు
👉🏻 ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల ఆఫ్షన్ ఉపసంహరణ
fans RS Praveen Kumar BRS Party
06/07/2024
👉🏻 అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం కు బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి, వారి పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి . - RS Praveen Kumar
👉🏻సీఐతో పాటు నలుగురు కానిస్టేబుళ్లపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.
BRS Party
23/06/2024
*హలో స్వేరో- ఛలో ఢిల్లీ*
జ్ఞాన యుద్ధం
నీ కోసమో,
నా కోసమో కాదు,
కాలం పురుడుపోసుకొని పుట్టే రేపటి బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం..!
దేశంలో ఎక్కడా లేని విధంగా జ్ఞాన సమాజం నిర్మాణమే లక్ష్యం అంటూ తెలంగాణ రాష్ట్రంలో స్వేరోస్ జ్ఞాన యుద్ధం పేరుతో విప్లవాత్మకమైన మార్పులకు నాందిపలికింది.గత చరిత్ర తిరిగరాసింది.అసాధ్యమనుకున్న వాటిని అవలీలగా చేసేలా స్వేరోస్ 10 కమాండ్మెంట్స్ లక్ష్యానికి దారులు వేశాయి.
ఈ జ్ఞానయుద్ధం అనేది మూఢ నమ్మకాలు, కుల, మతాలతో కాకుండా అజ్ఞానాన్ని వదిలించి, జ్ఞానం వైపు సమాజాన్ని నడిపించే ఏకైక స్వచ్ఛంద సంస్థ స్వేరోస్.
సమాజాన్ని చైతన్యం చేసేందుకు ఈ మహోన్నతమైన జ్ఞాన యుద్ధంలో మనల్ని భాగస్వామ్యులను చేసి, పేద ప్రజలకు చేయూతనిచ్చి,చదువు అనే ఆయుధం ద్వారా జ్ఞాన వంతులుగా ఎదగడానికి కృషి చేస్తోంది స్వేరోస్ నెట్ వర్క్.
స్వేరోయిజం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో పాటు దేశ నలుమూలల్లో 28 రాష్ట్రాల్లో స్వేరోస్ నెట్వర్క్ ను బలోపేతం చేయడం కోసం అన్ని రాష్ట్రాల స్వేరో ప్రతినిధులతో *ఈనెల 30న ఢిల్లీలో స్వేరోస్ నేషనల్* సమావేశం జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశంలో మనం బాగస్వామ్యులం అవుదాం.
21/06/2024
జ్ఞాన యుద్ధం
నీ కోసమో,
నా కోసమో కాదు,
కాలం పురుడుపోసుకొని పుట్టే రేపటి బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం..!
దేశంలో ఎక్కడ లేని విధంగా జ్ఞాన సమాజ నిర్మాణమే లక్ష్యం అంటూ తెలంగాణ రాష్ట్రంలో స్వేరోస్ జ్ఞాన యుద్ధం పేరుతో విప్లవాత్మకమైన మార్పులకు నాందిపలికింది, చరిత్ర తిరగరాసింది.
ఈ జ్ఞాన యుద్ధం అనేది,మనుషులతో,కుల, మతాలతో కాకుండా అజ్ఞానం పై చేసే యుద్ధంగా ఇతర సంఘాలకు భిన్నంగా కొనసాగుతున్న ఏకైక సంఘం ఈ దేశంలో స్వేరోస్
ఈ మహోన్నతమైన జ్ఞాన సమాజంలో మనల్ని భాగస్వాములుగా చేసి,
అజ్ఞానంతో అంతరించే పేద జాతులకు చేయూతనిచ్చి,చదువు అనే ఆయుధం ద్వారా వారి అజ్ఞానాన్ని అంతం చేసి జ్ఞాన వంతులుగా తీర్చిదిద్ధి జ్ఞాన సమాజానికి బాటలు వేసిన స్వేరోస్ నెట్వర్క్ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో పాటు దేశ నలుమూలల్లో 28 రాష్ట్రాల్లో స్వేరోస్ నెట్వర్క్ ను బలోపేతం చేయడం కోసం అన్ని రాష్ట్రాల స్వేరో ప్రతినిధులతో ఈనెల 30న ఢిల్లీలో స్వేరోస్ నేషనల్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేద్దాం..!.
స్థలం:ఢిల్లీ
సమయం :10am
Date : 30-06-2024
fans RS Praveen Kumar Swaeroes