02/06/2026
*తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు..*
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని 283వ డివిజన్ గురుమూర్తి నగర్ తో పాటు హెచ్ఎంటి (HMT ) కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించిన అప్పటి యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్ర సాధన వెనుక ఎన్నో ఏళ్ల ప్రజా ఉద్యమాలు, త్యాగాలు, పోరాటాల చరిత్ర ఉందని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను, త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.
అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో హెచ్ఎంటి జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డి మరియు కేశవ్, శ్రీశైలం, శ్రీనివాస్ నాయక్ మరియు స్థానిక 281 మరియు 283 డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
30/05/2026
*సంఘటన సృజన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజక వర్గ స్థాయి కార్యకర్తల సన్నాక సమావేశంలో పాల్గొన్న *మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ గారు*...
బహుదూర్ పల్లి లోని మేకల వెంకటేష్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సంఘటన సృజన అభియాన్ కార్యక్రమంలో భాగంగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నియమితులైన రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు కుత్బుల్లాపూర్ నియోజక వర్గ స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై కేంద్ర ఎన్నికల కమిషన్ వచ్చే నెల నుండి ప్రారంభించే సర్ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఏజెంట్లు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దానిపై ఈరోజు కార్యకర్తల ఉద్దేశించి ప్రసంగించారు, అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన పలు సలహాలు సూచనలను తెలియపరిచారు...
*అనంతరం కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకి మాత్రమే ప్రాధాన్యత దక్కుతుందన్నారు, క్షేత్రస్థాయి లో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లే కార్యకర్తలకు రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం దక్కుతుందని సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు, అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపట్టబోయే సర్ కార్యక్రమంలో కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉంది నకిలీ ఓట్లను తొలగించే విధంగా అధికారులతో సమన్వయం చేసుకుంటు 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులందరికీ నూతన ఓటు హక్కు కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు*...
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అద్యక్షులు వజ్రేష్ యాదవ్ గారు, స్థానిక కాంగ్రెస్ ఇంచార్జ్ హనుమంత్ రెడ్డి గారు, అసెంబ్లీ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు భూపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జైపాల్ రెడ్డి, కిషోర్ రెడ్డి, సమీర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు....
30/05/2026
*గాంధీభవన్ లో జరిగిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ కూన శ్రీశైలం గౌడ్ గారు*....
ఈ రోజు గాంధీ భవన్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఇందిరా భవన్ లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ ఏఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్ గారు మరియు ఏఐసీసీ సెక్రెటరీ సచిన్ సావంత్ గారి ఆధ్వర్యంలో జరిగిన కరీంనగర్ మరియు అదిలాబాద్, పెద్దపల్లి, పార్లమెంట్ నియోజకవర్గల సమావేశ కార్యక్రమంలో *కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ గారు* పాల్గొనడం జరిగింది..
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లి నియోజకవర్గాల్లో బూత్ ఏజెంట్లను మరియు అన్ని మండలాల్లో మండల కమిటీలను మరియు ఇతర అనుబంధ సంఘాల కమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సమావేశాన్ని ఉద్దేశించి మీనాక్షి నటరాజన్ గారు తెలియజేశారు..
అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామస్థాయి నుండి సంస్థగతంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన సలహాలు సూచనలను సమావేశాలు తెలియపరిచారు..
మాజీ శాసనసభ్యులు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలో గత వారం రోజులుగా సర్ కార్యక్రమం పై మరియు బి ఎల్ ఎ నియామకాలపై అసెంబ్లీ వారీగా నిర్వహించిన సమావేశాలపై పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి మరియు ఎఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్ గారికి పూర్తి స్థాయి నివేదికను అందించి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన విషయాలను వారికి తెలియపరిచారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..
29/05/2026
*కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్ అసెంబ్లీ మరియు చొప్పదండి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు*...
*కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ గారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమింపబడిన నేపథ్యంలో కరీంనగర్ అసెంబ్ నియోజకవర్గం మరియు చొప్పదండి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సన్నాక సమావేశం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మరియు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు మరియు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్లో లొ ఏర్పాటు చేయడం జరిగింది*...
ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం తో పాటు చొప్పదండి నియోజకవర్గం లో లొ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలకు సంబంధించి స్థానిక నాయకులకు పలు సలహాలు సూచనలు తెలియజేయడంతో పాటు డివిజన్ కమిటీలు మరియు మండల కమిటీలు బలోపేతం చేయాలని అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో చేపట్టబోయే సర్ (SIR) కార్యక్రమం పై అవగాహన సదస్సు సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు...
కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ SIR కార్యక్రమం పై కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఓట్ల తొలగింపు జరగకుండా చూడాలని నకిలీ ఓట్లను తొలగించే విధంగా బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయాలని, అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులందరూ ఓటు హక్కును నమోదు చేసుకునే విధంగా కృషి చేయాలని కార్యకర్తలను ఉద్దేశించి తెలియజేశారు..
అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలను ప్రజాక్షేత్రంలోకి బలంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.....
ఈ కార్యక్రమంలో చొప్పదండి శాసనసభ్యులు & కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం గారు, కరీంనగర్ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ గారు, జిల్లా గ్రంథాలయ సమితి చైర్మన్ సత్తు మల్లేశం గారు, కరీంనగర్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...
29/05/2026
*కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు*...
కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ గారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమింపబడిన నేపథ్యంలో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకులు సన్నాహక సమావేశాన్ని స్థానిక హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది...
ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలకు సంబంధించి స్థానిక నాయకులకు పలు సలహాలు సూచనలు తెలియజేయడంతో పాటు గ్రామ కమిటీలు మరియు మండల కమిటీలు బలోపేతం చేయాలని అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో చేపట్టబోయే సర్ (SIR) Special intensive Revision కార్యక్రమం పై అవగాహన సదస్సు సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు...
కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ SIR కార్యక్రమం పై కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఓట్ల తొలగింపు జరగకుండా చూడాలని నకిలీ ఓట్లను తొలగించే విధంగా బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయాలని, అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులందరూ ఓటు హక్కును నమోదు చేసుకునే విధంగా కృషి చేయాలని కార్యకర్తలను ఉద్దేశించి తెలియజేశారు..
అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలను ప్రజాక్షేత్రంలోకి బలంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.....
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రణవ్ గారు మరియు మున్సిపల్ చైర్మన్ సుహాసిని, వైస్ చైర్మన్ అంజలి తో పాటు వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...
28/05/2026
ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ గారు...
ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ గారు ఈరోజు ఐడిపిఎల్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి నందమూరి తారక రామారావు (NTR) విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారిని స్మరించుకున్నారు...
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఖ్యాతిని విశ్వ వ్యాప్తంగా తీసుకెళ్లిన గొప్ప మహనీయుడని, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతికి వినలేని కృషి చేశారని అదేవిధంగా సినీ రంగంలో గొప్ప నటనతో ప్రజల మన్ననలు పొందారని గుర్తు చేసుకున్నారు..
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జై రామ్, రంగారావు, కూన రాఘవేందర్ గౌడ్, మోటే శ్రీనివాస్ యాదవ్, గడ్డం రాజేందర్ రెడ్డి, రవి, దిలీప్, శంకరయ్య, రవీందర్ గుప్తా, మల్లం శీను, శంకర్ గౌడ్, తోకల శీను, శ్రీకాంత్ ,చోటు ఓంకార్, శివ, సురేందర్, క్రాంతి తదితరులతో పాటు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...