08/05/2026
The CPI(M) extends its support to the TVK under the leadership of C. Joseph Vijay to form the government in Tamil Nadu.
The official page of the Communist Party of India (Marxist) 'Telangana State'
సిపిఐ(ఎం) అంటే ప్రజల తరపున నిలబడే శక్తిగా అందరికీ గౌరవం , నమ్మకం. స్వార్థం, సంకుచితత్వం, సంపదలపై వ్యామోహం, పదవుల కలహాలు, కులమత రాజకీయాలూ వంటి వాటికిదూరంగా ప్రజలు తరుపున రాజీ లేని పోరాటం చేస్తున్న పార్టీ గాభారతకమ్యూని పార్టీ (మార్క్సిస్టు) (సిపిఐఎం) సుపరిచితం. . సంపాధించుకోవడం కోసం మాత్రమే రాజకీయలు అనుకునే పరిస్ధితిలో దేశం కోసం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఉన్నత ఆశయాలే ఆయుధాలుగా నడుస్తున్న ఏకైక పార్టీ సిపిఎం. దేశంలో వామపక్ష శక్తులలో అగ్ర భాగాన నిల్చిన అరుణారుణ చైతన్యం.
08/05/2026
The CPI(M) extends its support to the TVK under the leadership of C. Joseph Vijay to form the government in Tamil Nadu.
08/05/2026
అనేక రకాలుగా మోసపోతున్న రైతులు..
ప్రభుత్వం చెప్పే మాటలు వేరు..
రైతులకు జరుగుతున్నది వేరు..
మహబూబ్నగర్ మార్కెట్ యార్డులో రైతుల ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకొని మాట్లాడుతున్న సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు
07/05/2026
.*వరి ధాన్యం కొనుగోలు ప్రభుత్వ నిర్లక్ష్యం వీడాలి.*
*వరి కోనుగోలు జాప్యం వల్ల నలుగురి ప్రాణాలు కోల్పోయారు.*
*చనిపోయిన రైతు కుటుంబాలకు కోటి రూపాయలు చెల్లించాలి.*
*బండారు రవికుమార్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,*
*పైళ్ల ఆశయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డిమాండ్*
మంచిర్యాల జిల్లా లక్శెట్టిపేట మండలం గంపలపల్లి గ్రామంలో చనిపోయిన తనువుల నాగరాజు మరియు అభిలాష్ (తండ్రి కొడుకులు ), కొత్తూరు గ్రామంలో గుండారపు వెంకటేష్( 23) రైతు కుటుంబాలను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, మంచిర్యాల జిల్లా కమిటీ పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా *బండారు రవికుమార్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, పైళ్ల ఆశయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు* హాజరై మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నాలుగు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వరి ధాన్యం కోసి 25 రోజులు గడిచిన ఇంకా కల్లాలకే పరిమితమైన వరి ధాన్యం అకాల వర్షం, గాలి దుమారాం నుంచి కాపాడుకునే క్రమంలో అక్కడ గోడ ప్రక్కన నిలవడం వల్ల గాలి దుమారానికి ఆ గోడ కూలి ముగ్గురు రైతులు, ఒక కౌలు రైతు చనిపోయారు. చనిపోయిన రైతు కుటుంబాల బాధ వర్ణనాతీతం. ప్రభుత్వం సరైన సమయంలో వరి కొను గోలు చేస్తే ఇలా జరిగి ఉండేది కాదు. చనిపోయిన రైతు కుటుంబాలను ఇప్పటివరకు అధికారులు కానీ, నాయకులు పరామర్శించలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా వరి కొనుగోళ్లు వేగవంతం చేసి కోతలు లేకుండా చూడాలి. చనిపోయిన రైతు కుటుంబాలకు ఒక కోటి రూపాయలు చెల్లించాలని సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో సంకె రవి సిపిఎం జిల్లా కార్యదర్శి, కనికర అశోక్, ప్రకాష్, బోడెంకి చందు సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు, ఉమా రాణి, దూలం శ్రీనివాస్, రాజారామ్, , శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా లక్శెట్టిపేటమండలం కొత్తూరు గ్రామంలో కళ్ళంలో ఉన్న ధాన్యాన్ని అకాలవర్షం, గాలిదుమారం నుంచి కాపాడుకొనే క్రమంలో షెడ్ కూలి వెంకటేష్ మరణింంచారు. వీరి అకాల మరణానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే.. కోతలు కోసి 25 రోజులైనా ప్రభుత్వం ధాన్యాన్ని కొనని కారణంగా ధాన్యపురాసులు కళ్ళాల్లోనే ఉండిపోయాయి. వీరి కుటుంబాలను పరామర్శించిన సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు కా.బండారు రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు కా. పైళ్ల ఆశయ్య,సిపిఎం జిల్లా కార్యదర్శి కా. సంకే రవి తదితరులు. భాదిత కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇచ్చి అన్నివిధాల ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది
మంచిర్యాల జిల్లా లక్శెట్టిపేట మండలం గంపలపల్లి గ్రామంలో కళ్ళంలో ఉన్న ధాన్యాన్నిఅకాలవర్షం, గాలిదుమారం నుంచి కాపాడుకొనే క్రమంలో గోడ కూలి తండ్రి కొడుకులైన నాగరాజు, అభిలాష్ మరణింంచారు. వీరి అకాల మరణానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే.. కోతలు కోసి 25 రోజులైనా ప్రభుత్వం ధాన్యాన్ని కొనని కారణంగా ధాన్యపురాసులు కళ్ళాల్లోనే ఉండిపోయాయి. వీరి కుటుంబాలను పరామర్శించిన సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు కా.బండారు రవికుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు కా. పైళ్ల ఆశయ్య,సిపిఎం జిల్లా కార్యదర్శి కా. సంకే రవి తదితరులు. భాదిత కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇచ్చి అన్నివిధాల ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది
07/05/2026
అధినేత విజయ్కే ప్రభుత్వం ఏర్పాటు చేసే మొదటి అవకాశం ఇవ్వాలి
CPM రాష్ట్ర కార్యదర్శి పి.శణ్ముగం
* 234 స్థానాలున్న అసెంబ్లీలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదని, అయితే 108 మంది ఎమ్మెల్యేలతో టీవీకే అతిపెద్ద పార్టీగా నిలిచింది.
* ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం విజయ్ మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చారని,
* మరే ఇతర కూటమి హక్కు కోరనప్పుడు గవర్నర్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు.
* గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దం
* బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నర్ వ్యవస్థను వాడుకుంటోంది.