G.sivanna

G.sivanna

Share

political party

Photos from G.sivanna's post 23/02/2026

Congratulations 🎉

Photos from G.sivanna's post 01/11/2025

Happy marriage life Swetha

ఎంపీ గోరంట్ల మాధవ్ పై వ్యక్తిగత విమర్శలు దిష్టిబొమ్మల దహనం చేస్తే సహించం అని హెచ్చరించిన కు 08/08/2022

https://youtu.be/wDKlfnRVT0E

ఎంపీ గోరంట్ల మాధవ్ పై వ్యక్తిగత విమర్శలు దిష్టిబొమ్మల దహనం చేస్తే సహించం అని హెచ్చరించిన కు గోరంట్ల మాధవ్ గారి పై మార్ఫింగ్ వీడియోలను ఖండిస్తూ కర్నూలు జిల్లా కురవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం అదొని ఐశ్వర్య ల...

02/08/2022

*ఆగష్టు 7,8,9తేదీల్లో హాలో బి.సి.ఛలో ఢిల్లీని జయప్రదం చేయాలి*

*బిసి బచావో...మోడీ హటావో నినాదంతో బిసిలు చైతన్యం కావాలి*

*ఓబిసి గణన చేస్తారా --- పదవి నుండి తప్పుకుంటారా?*

ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆగష్టు 7,8,9తేదీల్లో హాలో బి.సి.ఛలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలని,బిసి బచావో...మోడీ హటావో నినాదంతో బిసిలు చైతన్యం కావాలని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర రావు ఆదేశాల మేరకు గౌరవ అధ్యక్షులు గడ్డం రామకృష్ణ సీనియర్ వాల్మీకి నాయకుడు కుబేర స్వామి జిల్లా అధ్యక్షులు గుడిసె శివన్న జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు మంగళవారం కర్నూల్ లోని బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఓబిసి గణన చేస్తారా --- పదవి నుండి తప్పుకుంటారా? అని మోడీని ప్రశ్నించారు.1990 ఆగస్టు 7వ తేదీన బి.పి. మండల్ కమిషన్ రిపోర్టును అమలు చేస్తామని పార్లమెంటులో ప్రకటించిన దినంగా ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో పెద్ద ఎత్తున మహాసభను నిర్వహించబోతున్నట్లు చెప్పారు.ఆగష్టు
8వ తేదీన పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని 28 రాష్ట్రాల ప్రతినిధులు, వేలాదిగా వచ్చి సభను జయప్రదం చేయాలని తీర్మానించడం జరిగిందన్నారు.ఇప్పటికే కార్యక్రమానికి 22 రాజకీయపార్టీల మద్దతును ప్రకటించాయని అన్నారు.జనాభాలో 60 కోట్లకు పైగా వున్న ఓ.బి.సి.ల న్యాయమైన కోర్కెలను తీర్చుటకు కేంద్రంపై సమరభేరి మోగించాలని వివిధ రాష్ట్రాల ఓ.బి.సి. సంఘముల అధ్యక్ష కార్యదర్శులకు తెలియజేసామన్నారు.వివిధ రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు తమ మద్దతును తెలియజేశారని,నాటి సమావేశానికి బి.జె.పి. యేతర పార్టీల ముఖ్యనేతలను ఆహ్వానించడం జరిగిందని చెప్పారు.కమిటీ తీసుకున్న నిర్ణయాలలో ప్రధానమైన ఓ.బి.సి.గణన చేపట్టాలని, 52 శాతం ఉన్న ఓబిసిలకు కేంద్ర రాష్ట్ర శాసనసభలలో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, క్రిమిలేయర్ ను రద్దు చేయాలని,ఓ.బి.సి. ఉద్యోగులకు ప్రమోషన్స్ కల్పించాలని,కేంద్ర ప్రభుత్వంలో బి.సి. మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగిందని పేర్కొన్నారు.గుజరాత్లో బి.జె.పి. ప్రభుత్వం ఒరిస్సా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిషన్ ని నియమించినట్లు చెప్పారు. అయితే కమిషన్ ను నియమించినంత మాత్రాన ఓ.బి.సి.ల సమస్యలో ప్రభుత్వం తన కర్తవ్యాన్ని . నిర్వహించినట్లు కాదన్నారు. రాష్ట్రంలో ఓ.బి.సి.ల కులాల వారీ జనగణనను,అలాగే వారి సామాజిక,ఆర్థిక , స్థితిగతులకి సంబంధించిన గణాంకాలను వాస్తవిక దృకధంతో సేకరించాలని కోరారు.అందుకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించి సహకరించాలన్నారు. గతంలో ఓ.బి.సి.లకు 10 శాత మాత్రమే రిజర్వేషన్లను కల్పించిన ఆధిపత్య కుల మనస్థత్వం నుండి బి.జె.పి.ప్రభుత్వం బయటపడాలని సూచించారు జనాభాలో ఓ.బి.సి.లు 50 శాతానికి పైగా వున్నారన్న వాస్తవిక దృష్టితో గుజరాత్ ప్రభుత్వంగానీ,ఇతర రాష్ట్రాల స్థాయి జనగణనలో భాగంగానే సేకరించే దిశగా కార్యాచరణకి సంసిద్ధం కావాలని వారు తెలిపారు. జిల్లాలో బిసిల చైతన్యం కోసం అహర్నిశలు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాని విజయవంతం చేయాలని కోరుతున్నారు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె.శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.

11/06/2022
07/07/2021

I congratulate all the colleagues who have taken oath today and wish them the very best for their ministerial tenure. We will continue working to fulfil aspirations of the people and build a strong and prosperous India.

17/01/2021

అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణం ప్రతీ హిందువు చిరకాల స్వప్నం . ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ మహాశయుని చేతుల మీదుగా నిర్మాణ శ్రీకారం చేయబడింది .

రామసేతు నిర్మాణంలో ఉడతలా మనమందరం అవుదాం ఈ యుగం ఉడతలం భవ్య రామ మందిర నిర్మాణంలో .

ఈ నెల 15 నుండి 31 వరకు మీవద్దకు వచ్చే రామ సేవకులకు భూరి విరాళాలు ఇచ్చి , రామ మందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలసినదిగా కోరుతున్నాను . రామయ్య ఇస్తున్న మహదవకాశం మనందరికీ .

01/01/2021

రాష్ట్ర ప్రజానికానికి, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అధికారులకు, సైనిక సోదరులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.

Photos from G.sivanna's post 06/12/2020

సినీ నటి విజయశాంతి బీజేపీలో చేరికకు రంగం సిద్ధమైంది. అందులో భాగంగా.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో విజయశాంతి ఆదివారం భేటీ అయ్యారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిని కూడా కలిశారు. విజయశాంతి వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, వివేక్ ఉన్నారు. విజయశాంతి సోమవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమలం పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఢిల్లీ పెద్దల సమక్షంలో విజయశాంతి సోమవారం బీజేపీలో చేరుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని సముదాయించేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్‌ను రంగంలోకి దింపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. పార్టీ ఆదేశాల మేరకు కుసుమకుమార్ విజయశాంతి నివాసానికి వెళ్లి మరీ చర్చలు జరిపారు. ఈ చర్చలు విఫలమయ్యాయి. రాములమ్మ బీజేపీలో చేరేందుకే మొగ్గు చూపారు.

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Hyderabad
500037