05/10/2023
ఎండపల్లి గ్రామ పెద్దలు గ్రామానికి అన్ని రకాలుగా అండదండలుగా ఉండి అన్ని కుల సంఘాలను అందరి మనుషులను సొంత మనుషులుగా భావించి తన జీవితం గ్రామానికి అంకితం చేసిన ఏలేటి కృష్ణారెడ్డి గారు గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్ననందున ఆ కోటిలింగేశ్వర స్వామి దయవలన తొందరగా కోలుకొని మళ్లీ సాధారణ జీవితం కొనసాగించాలని కోటిలింగాల దేవాలయంలో పూజలు నిర్వహించడం జరిగినది. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాయల శ్రీనివాస్ గారు, యాదవ సంఘం అధ్యక్షులు సంపతి సతీష్ గారు, యువకులు బత్తిని రవి గారు, పాములపర్తి సురేష్ గారు, సిలివేరి అంజి గారు సుబ్బ రవి గారు, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
25/03/2023
దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతాత్ - వికాస్ పురస్కార్ (జాతీయ పంచాయతీ అవార్డ్స్) 2022-23 సంవత్సరమునకు గాను వెలగటూర్ మండలంలో హెల్తీ పంచాయితీ మొదటి అవార్డ్ మన ఎండపల్లి గ్రామానికి రావడం జరిగినది.
దీనికి సహకరించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి&ఉపసర్పంచ్, మండల & గ్రామస్థాయి అన్ని శాఖల అధికారులకు ,పాలకవర్గ&వార్డు సభ్యులకు,అంగన్వాడీ, ఆశా వర్కర్లకు గ్రామ పంచాయితీ సిబ్బందికి , ప్రజాప్రతినిధులకు, గ్రామస్థులందరికి పేరుపేరునా ప్రతిఓక్కరికి ధన్యవాదాలు..🙏
ఇదే విధంగా ఎల్లప్పుడూ అభివృద్ధికి సహకరించి మన గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకపోవాలని కోరుకుంటున్నాను.
-మీ మారం జలంధర్ రెడ్డి
సర్పంచ్ ఎండపల్లి.
17/03/2021
రాష్ట్రంలో ఐపీఎస్ ఆఫీసర్లు కేసీఆర్ కోసం, ఓవైసీ కోసం పనిచేస్తున్నారా ?
అరెస్ట్ చేసిన హిందూ వాహిణి కార్యకర్తలను దారుణంగా హింసించారు. మీకూ కుటుంబాలు లేవా ?
వాళ్లకు అలాంటి పరిస్థితి ఎదురైతే తెలుస్తుంది. పోలీసులు క్రాంతి అనే యువకుడిని కొట్టి నేరం ఒప్పించారు. మరో కార్యకర్త లింగోజీపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. కిరాతకంగా కరెంట్ షాక్, ఇంజెక్షన్లు ఇచ్చి వేధించారు. ఎన్ కౌంటర్ చేస్తామంటూ బెదిరించారు. కొంతమంది ఐపీఎస్ లు క్రిమినల్స్ గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నీచుడు, మానవత్వం లేని మానవమృగం. ఓవైసీ అనే దుర్మార్గుడి కోసం హిందువులను ఇబ్బంది పెడతారా..?
తాగి పాలన చేస్తున్న కేసీఆర్ కు హిందూ వాహిణి దమ్మేంటో చూపిస్తాం. భైంసాను మేం కాపాడుకుంటాం. 28 మంది హిందువులపై అక్రమంగా కేసులు బనాయించారు. ఎంత మందిపై నాన్ బెయిలబుల్ కేసులు బనాయిస్తారో చూస్తాం. కత్తులతో పొడిచింది హిందువులను. ఆస్తులు కోల్పోయింది హిందువులే. చివరికి కేసులు పెట్టింది హిందువుల పైనే. కొంతమంది లుచ్చాగాళ్లు మహారాష్ట్ర నుంచి వస్తే మతోన్మాదులు భైంసాలో వాళ్లకు షెల్టర్ ఇస్తున్నారు. భైంసాలో హిందువులకు సంబంధించిన 12 ఇళ్లను దగ్ధం చేస్తే, ముఖ్యమంత్రి స్పందించలేదు. కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నడు. హిందువులపై అక్రమంగా కేసులు బనాయిస్తూ జైళ్లలో వేధిస్తున్న ఐపీఎస్ అధికారులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలి. మా కార్యకర్తలపై దాడులు చేసిన ఐపీఎస్ అధికారులను వదిలిపెట్టేది లేదు. కొంతమంది దుర్మార్గులు ఓ పసిపాపపై అత్యాచారం చేస్తే, బాధిత చిన్నారికి వైద్యచికిత్స అందించలేని దుర్మార్గపు ప్రభుత్వమిది. ఆ చిన్నారిని మేం కాపాడి వైద్య చికిత్స అందించాం. తెలంగాణ రాష్ట్రంలో హిందూ ధర్మ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నవారిని ప్రోత్సహిస్తూ పెంచి పోషిస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం.
నిఖార్సైన హిందువని చెప్పుకునే కేసీఆర్, హిందువులపై దాడులు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదు..?
ఓ సంస్థ హిందూ దేవతలను కించపర్చేలా వ్యవహరిస్తుంటే రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది..?
రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముఖ్యమంత్రి గడీలో బందీ అయింది.
హిందూ దేవతలపై విషం చిమ్ముతున్న స్వేరో సంస్థకు ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి. ఆ సంస్థను స్వయానా ముఖ్యమంత్రే పెంచి పోషిస్తున్నడు. హిందూ ధర్మంపై విద్వేషాలు సృష్టిస్తూ విషం చిమ్ముతున్న వారికి తొత్తుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ఐపీఎస్ అధికారి ఆధారాలతో సహా దొరికితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..?
ఆ సంస్థకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో విచారణ జరపాలి.
సీఎం కేసీఆర్కు మానవత్వం లేదు. ఓవైసీ కోసం కేసీఆర్ హిందువులను బలి చేస్తున్నడు. బీజేపీ కార్యకర్తలను అరెస్టులు చేసి జైలుకు పంపుతున్న కేసీఆర్ కు, మున్ముందు ఇదే గతి పడుతుంది. కేసీఆర్ కొడుక్కు అదే గతి పట్టిస్తాం. భైంసాలో హిందువులపై జరిగిన విధ్వసంకాండ ఘటనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.