15/04/2017
*ఫాదర్ అఫ్ ది నేషన్*
భారతదేశం లో 1891ఏప్రిల్14 న మధ్యప్రదేశ్ (ప్రస్తుతం)లో ఉన్న ఓక మారు మూల ప్రాంతంలో మహర్ కులం లో జన్మించిన అంబవడేకర్ .. అనే చిన్నారి దళిత బిడ్డ . అంటరానితనాన్నీ ముక్కు పచ్చలారని వయసులో ఎదుర్కొన్న ఆ చిన్నారి కాల క్రమేణా .....డా" బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబెడ్కర్ గా మారే క్రమం లో ప్రపంచ మేధావులు సైతం ఆయన మేధా సంపత్తి కి దాసోహం అయ్యారు.1907 లో మేట్రీక్యూలేషన్ పూర్తి చేసిన మొట్ట మొదటి దళిత బిడ్డగా ఆరంభం అయిన ఆ మహనీయుడి ప్రస్థానం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొలంబియా,ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లు సైతం ఆయన విజ్ఞానం ముందు మొకరిల్లాయ్.అంటారని దళిత బహుజను ల కోసం మూక్ నాయక్(మూగవాళ్ళనాయకుడి) గా అయన చేయని పోరాటం లేదు.స్త్రీలు,బలహీన వర్గాల, మైనార్టీ ల హక్కుల కోసం పోరాడిన భారత దేశ దిక్సూిచి.రాజనీతి శాస్త్రం దగ్గరి నుంచి న్యాయ శాస్త్రం వరకు ..ఎన్నో శాస్త్రాలను అవపోసన పట్టిన మహా మేధావి. భారత దేశములోని అన్నీ కులాలను అధ్యయనం చేసి వారి హక్కులు, మనుగడ కోసం రాజ్యాంగం లో రిజర్వేషన్ లు పొందు పరిచిన దళిత వారియర్. ప్రపంచం(ఐక్య రాజ్య సమితి) గుర్తించిన...భారత దేశం అత్యంత లేటు గా(1990 లో భారత రత్న-జవహర్ లాల్ నెహ్రు, ఇందిర గాంధీ వారు ప్రదాని గా ఉండగానే వాళ్ళకు వాళ్లే ప్రకటించు కున్నారు, ఆఖరికి ఎం జి రామచంద్రన్ (తమిళనాడు) కు ఇచ్చిన తరువాత)గుర్తించిన మన ఫాదర్ అఫ్ ది నేషన్.....ఆ మహా నీయుడి 126 వ జయంతి ఉత్సవాలు సందర్భం గా
జై పూలే-జై భీమ్..

10/04/2017
28/03/2017