17/01/2024
*గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తుల అరెస్టు*
తేదీ 15-01-2024 రోజున మధ్యాహ్నం 2 గంటలకు నమ్మదగిన సమాచారం మేరకు భూపతిపూర్ x రోడ్ వద్ద ఎస్సై అజయ్ తన సిబ్బంది తో యుక్తంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన ఎండి దిల్షాద్(23), కడార్ల మహేష్(19), పెద్దిరెడ్డి జయంత్(23), దొనిపాల సాయి భరద్వాజ్(21) మరియు ఒక మైనర్ మొత్తం ఐదుగురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి సుమారు రూ. 1,00,750 విలువ గల 4.03 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని, వారి వద్ద నుండి ఐదు సెల్ ఫోన్లు మరియు రెండు బైక్ లను జప్తు చేయడం జరిగింది. నిందుతులు ఇటీవలనే ఆసిఫాబాద్ జిల్లా నుండి గంజాయిని తీసుకుని రావడం జరిగింది. వారి ఐదుగురు పై ఎస్సై అజయ్ కేసు నమోదు చేసిన అనంతరం, దర్యాప్తు అధికారి అయిన జగిత్యాల రూరల్ సీఐ ఆరిఫ్ అలీ ఖాన్ గారు నిందితులను రిమాండ్ కి తరలించడం జరిగింది. నిందితులను చాక చక్యంగా పట్టుకున్న కానిస్టేబుల్స్ సాగర్, సంతోష్ మరియు ప్రశాంత్ లను సీఐ గారు అభినందించారు.

12/01/2021
24/12/2020
19/12/2020