21/03/2026
ముస్లిం సోదర,సోదరీ మణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు!💐💐💐
our Ultimate Aim is Rule India
21/03/2026
ముస్లిం సోదర,సోదరీ మణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు!💐💐💐
19/03/2026
05/09/2025
బీఎస్పీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సమీక్షా సమావేశం.
ఈ రోజు మహబూబ్ నగర్ లో!
01/09/2025
నారాయణ పేట జిల్లా,నారాయణపేట మండలం లింగంపల్లి గ్రామంలో వివిధ పార్టీల నుండి బీఎస్పీలో చేరిన యువకులు!
07/08/2025
🌾🌾🌾🌾
💥నారాయణ పేట జిల్లా భూ నిర్వాసితుల పాదయాత్రలో పాల్గొన్న బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్🌾🌾
💥 కొడంగల్ - నారాయణ పేట ఇరిగేషన్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి!
💥 భూసేకరణ చట్టం - 2013 ను అమలు చేయాలి!
💥రైతులను మోసం చేస్తే తగిన గుణపాఠం తప్పదు!
💥ముఖ్యమంత్రి సొంత జిల్లాలో రైతులకు న్యాయం జరగదా?
💥 రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం!
💥బీఎస్పీ నారాయణపేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్
31/05/2025
తెలుగు రాష్ట్రాల నూతన ఇంచార్జ్ గా నియమితులై,నేడు రాష్ట్ర *కార్యాలయానికి సమీక్షా సమావేశానికి విచ్చేసిన జాతీయ కో- ఆర్డినేటర్, UP మాజీ ముఖ్యమంత్రి మాయావతి గారి (PRO)& బీఎస్పీ మాజీ రాజ్యసభ ఎంపీ,రాజారాం గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
🐘🐘🐘
31/03/2025
అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు!
Happy Ramzan to everyone.
आप सभी को रमज़ान पर्व दिन की हार्दिक शुभकामनाएँ ।
سب کو
30/03/2025
అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
Happy Ugadi to everyone.
💐💐💐
24/12/2024
పత్రికా ప్రకటన
తేది:24/12/2024
నారాయణ పేట
💥 కేంద్ర మంత్రి అమిత్ షాను భర్తరఫ్ చేయాలి
💥 బీజేపీ,కాంగ్రెస్ ఒకే తానులో ముక్కలే
💥 అమిత్ షా వ్యాఖ్యలపై మోడీ ఎందుకు మాట్లాడరు?
💥 తక్షణమే అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ బీఎస్పీ నిరసన ర్యాలీ
💥 అంబేద్కర్ అంటే బీజేపీకి అంత విషం ఎందుకు?
💥 బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్
బాబా సాహెబ్ అంబేద్కర్ అంటే బీజేపీకి అంత విషం ఎందుకని బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్ ప్రశ్నించారు.అంబేద్కర్ గారిని అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై,బీఎస్పీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ,కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటేనని విమర్శించారు. నాడు అంబేద్కర్ గారిని కాంగ్రెస్ అవమానిస్తే,నేడు బీజేపీ అవమానిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానిస్తూ అమిత్ షా మాట్లాడితే ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడడం లేదో సమాధానం చెప్పాలన్నారు.అమిత్ షా కేంద్ర మంత్రి పదవి అంబేద్కర్ బిక్షనే అన్న విషయం మరిచిపోరాదన్నారు.మోడీ గారికి అంబేద్కర్ పట్ల,రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్న అమిత్ శా ను మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చంద్రయ్య,జిల్లా ఇంచార్జీ వెంకటేష్ ముదిరాజ్,జిల్లా కార్యదర్శి బండారి చంద్రశేఖర్,నారాయణ పేట అసెంబ్లీ అధ్యక్షులు ఎర్ర హన్మంతు,మక్తల్ అసెంబ్లీ ఇంచార్జీ పాలెం వెంకటయ్య,అధ్యక్షులు గువ్వల తిరుపతి,సోషల్ మీడియా ఇంచార్జీ అశోక్,పేట మండల అధ్యక్షులు రమేష్,బీఎస్పీ నాయకులు గౌతం, సయ్యద్ మహమూద్,అజయ్,రాము,చెన్నయ్య,హన్మంతు,వీరన్న,రాజు,రవి యాదవ్,అరవింద్,జడల బాల్ రాజ్, మక్తల్ మండల అధ్యక్షులు పరుశురాం, కృష్ణ మండల అధ్యక్షులు మల్లికార్జున్,తిరుపతి, భీములు,కృష్ణ,తదితరులు పాల్గొన్నారు
28/11/2024
🔥 తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) ద్వితీయ మహాసభలో పాల్గొన్న బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్
🔥నిజాలు రాసే పాత్రికేయులంటే ఆధిపత్య దొరలకు భయమెందుకు?
🔥 సమాజంలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమైనది!
🔥 నిజాలు జీర్ణించుకోలేని ఆధిపత్య పార్టీలు, పాత్రికేయులపై దాడులకు పాల్పడడం అత్యంత దారుణం!
🔥 ప్రింట్, ఎలక్ట్రానిక్ పాత్రికేయులకు భద్రతా కల్పించాలి
🔥 పాత్రికేయుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
🔥 సమాజం కోసం నిజాయితిగా పని చేసే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యలపై పోరాటానికి BSP మద్దతుగా ఉంటుంది
26/10/2024
పత్రికా ప్రకటన
తేది:26/10/2024
కోయిల్ కొండ
ప్రజా పాలన పేరుతో దోపిడీ పాలన చేస్తున్న కాంగ్రెస్!
రెవెన్యూ,పోలీసు అధికారుల అండతో ఇసుక అక్రమ రవాణా!
కోట్ల రూపాయల ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్న అధికార పార్టీ నాయకులు
బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్*
ప్రజా పాలన పేరుతో అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ సంపదను దోచుకుంటున్నారని బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్ ఆరోపించారు.ఇసుక అక్రమ రవాణాపై శనివారం కోయిల్ కొండ మండల తహసీల్దార్ గారికి పిర్యాదు చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసు,అధికారుల అండతో మండలంలోని సూరారం,కుష్ మహమ్మద్ పల్లి,అంకిళ్ళ గ్రామ వాగులో నుండి ప్రతి రోజు కోట్లాది రూపాయల విలువైన ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని,ఆరోపించారు.ప్రజా పాలన అంటూ నిత్యం ప్రజల్ని మభ్యపెడుతు ముఖ్యమంత్రి గారికి సొంత జిల్లాలో పార్టీ నాయకుల అక్రమాలు కనిపిస్తలేవా? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు,ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పూర్తిగా దోచుకోవడమే కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా మారిందన్నారు. ఇసుక అక్రమార్కులకు కొమ్ము కాస్తున్న
పోలీసులు,రెవెన్యూ అధికారులపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ కోయిల్ కొండ మండల అధ్యక్షులు రమేష్, నియోజకవర్గ మీడియా ఇంచార్జ్ అశోక్, బీఎస్పీ నాయకులు హరీష్,హన్మంతు,బాబు, వెంకటయ్య,వీరన్న, అజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు