Telugu Desam Party: Nandikotkur

Telugu Desam Party: Nandikotkur

Share

Official Page of TDP Nandikotkur

Photos from Telugu Desam Party: Nandikotkur's post 26/03/2026

ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ప్రజాప్రతినిధులు తో జరిగిన సమావేశంలో పాల్గొన్న నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య గారు




Photos from Telugu Desam Party: Nandikotkur's post 26/03/2026

ఈరోజు విజయవాడ సచివాలయం లో 5 వ బ్లాక్ లో నంద్యాల జిల్లాకు చెందిన సహచర మంత్రులు, ఎమ్మెల్యే లు, ఉన్నత అధికారులతో మర్యాదపూర్వకంగా భేటీ అయిన నందికొట్కూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య గారు
సంక్షేమ కార్యక్రమాలు, ప్రధాన సమస్యలు రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించడం జరిగింది




Photos from Telugu Desam Party: Nandikotkur's post 07/03/2026

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan గారిని నందికొట్కూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య గారు అసెంబ్లీ చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు గురించి వివరించి..

కొణిదెల అభివృద్ధికి సొంత నిధులతో మీరు మంజూరు చేసిన రూ.50 లక్షల నిధులతో 90 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ఓవర్హెడ్ నీటి ట్యాంకు నిర్మాణం పూర్తయింది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వివరించి ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు

నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు నియోజకవర్గ అభివృద్ధి సమస్యలపై పంచాయతీరాజ్ పనుల గురించి పవన్ కళ్యాణ్ గారికి వివరిస్తూ కొణిదెల గ్రామానికి 'పల్లె పండుగ 1.0'లో రూ.20 లక్షలకు పైగా వెచ్చించి 3 అంతర్గత రోడ్లు పల్లె పండుగ 2.0'లో రూ.45 లక్షలతో చేపట్టిన 7 సీ రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయి ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు తెలపడం జరిగింది

అనంతరం: కొణిదెల జిల్లా పరిషత్తు స్కూలు నుంచి పగిడ్యాల మండల పరిధిలోని లక్ష్మాపురం వరకు 5 కి.మీ. మేర బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లు, పంచాయతీ రాజ్ నిధులు రోడ్డు నుంచి గ్రామం వరకు రోడ్డు పునరుద్ధరణకు రూ.45 లక్షలు మంజూరు చేయాల్సిందిగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు విన్నపించుకోవడం జరిగింది.

అంతరం: పంచాయతీ రాజ్ సంబంధించిన నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో చాలా రోడ్లు అభివృద్ధికి నోచుకోలేక, నిర్లక్ష్యానికి గుర‌య్యాయి. కనీసం రోడ్ల మరమ్మత్తు పనులు కూడా గత ప్రభుత్వం చేపట్టకపోవడంతో అనేక గ్రామాలలో రోడ్లు చాలా అద్వాన్న పరిస్థితుల్లో ఉన్నాయి. వర్షాలకు నియోజవర్గంలోని గ్రామీణ ప్రాంతాల రోడ్లన్నీ దెబ్బ‌తిన్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ తరఫున రోడ్ల మరమ్మతుకు, కొత్త రోడ్ల నిర్మాణానికి అధిక నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు కోర‌డం జ‌రిగింది.

అనంతరం: కొత్తపల్లి మండలం శివపురం గ్రామం నల్లమల్ల ఫారెస్ట్ పరిధిలో వెలిసినటువంటి కొలనుభారతి సరస్వతి అమ్మవారి గుడికి వెళ్ళుటకు బీటీ రోడ్డుకు మరియు విద్యుత్ సౌకర్యానికి మరియు జూపాడు బంగ్లా మండలం పారమంచాల గ్రామం నుంచి మిడ్తూర్ మండలం బరక సంజరాయుడు వరకు గతంలోనే అనుమతి ఇచ్చిన బీటి రోడ్డుకు ఫారెస్ట్ అధికారులు ఆటంకం కలిగిస్తున్నారు, మానవత్వ దృక్పథంతో మా నియోజకవర్గంలో ఉన్న గుళ్ళు కు రహదారులకు నిర్మించుటకు సహకరించవలసిందిగా పవన్ కళ్యాణ్ గారికి విన్నపించిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పానుకులంగా స్పందిస్తూ త్వరలోనే నందికొట్కూరు నియోజకవర్గం సమస్యలపై, అభివృద్ధి పనులకు పూర్తి సహకారం అందిస్తామని, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా నిధుల మంజూరు, రోడ్డు పనులు, స్థానిక సమస్యలపై త్వరలోనే చర్యలు చేపడతామని స్వయంగా కొణిదెల గ్రామాన్ని సందర్శిస్తామని భరోసా ఇచ్చారు.

నందికొట్కూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గం సమస్యల పైన స్పానుకులంగా స్పందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు..




27/02/2026

పేదల ఆరోగ్యరక్షా వారధి "ముఖ్యమంత్రి సహాయ నిధి...!!
18 నెలల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో అనారోగ్యంతో ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్న 395 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 3,05,55,365-00 కోట్లు మంజూరు చేయించిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు.




17/02/2026

రాయలసీమ భవిష్యత్తుకు బలమైన బడ్జెట్ పేదల జీవితాల్లో మార్పు తెచ్చేలా కేటాయింపులు, విద్యారంగం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు, అన్ని ప్రాంతాలు, వర్గాలకు సమన్యాయం, సీఎం చంద్రబాబుకు, పయ్యావులకు ధన్యవాదాలు, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు

నందికొట్కూరు P4 కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పాలకుల చేతకానితనంతో కుదేలైన రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ ఒక అద్భుతమైన ‘బ్లూఫ్రెంట్ అని కొనియాడారు.

కోట్లాది మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పూర్తి నిబద్ధతతో ఈ బడ్జెట్‌ను రూపొందించినందుకు ముఖ్య మంత్రి చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కు ధన్యవాదాలు తెలిపారు ఇది కేవలం అంకెల గారడీ కాదని, ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేలా వారి జీవితాల్లో మార్పు తెచ్చేలా రూపొందించిన ‘చేతల బడ్జెట’ అని కొనియాడారు. రూ.3,32,205 కోట్లతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అన్నివర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.53,915 కోట్లు కేటాయించడం ప్రభుత్వ సాహసోపే తమైన నిర్ణయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కేవలం మాటల తోనే రైతులను మభ్యపెట్టిందని మండిపడ్డారు.

ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తి చేసేందుకు ఊతం
కూటమి ప్రభుత్వం రైతన్నను నిజమైన రాజును చేసేందుకు వ్యవసాయం, దాని అను బంధ రంగాలకు రూ.13,598 కోట్లు కేటాయించింది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత ఐదేళ్లుగా జరిగిన నిర్లక్ష్యాన్ని వీడి, అటు మేజర్ ప్రాజెక్టులతో పాటు ఇటు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ఈ బడ్జెట్ అద్దం పడుతోందని ఆమె వివరించారు. పేద వాడికి సొంత ఇల్లు ఉండా లనే లక్ష్యంతో గత బడ్జెట్ (రూ.2000 కోట్లు) కంటే మూడు రెట్లు అధికంగా ఈ ఏడాది రూ.6,357 కోట్లు కేటాయించడం గర్వకారణమని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం కోసం ఏకంగా రూ.91,000 కోట్లు కేటా యించాం. సాధారణ సంక్షేమ పథకాలకు గత ఏడాది రూ. 41,000 కోట్లు ఉంటే ఈసారి దాన్ని రూ.53,000 కోట్లకు పెంచ డం మా ప్రభుత్వ చిత్త శుద్ధికి నిదర్శనమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు, పేర్కొన్నారు.




22/11/2025

నందికొట్కూరు నియోజకవర్గంలో మొంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన మొక్కజొన్న రైతుల కోసం, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులకు న్యాయమైన ధర క్వింటాకు రూ.2,400 వెంటనే ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వివరించడం జరిగింది.






21/11/2025

ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు విన్నపించుకుంటూ, నందికొట్కూరు నియోజకవర్గంలో మొంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన మొక్కజొన్న రైతుల కోసం, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులకు న్యాయమైన ధర క్వింటాకు రూ.2,400 వెంటనే ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వివరించారు ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చంనాయుడు గారితో చర్చించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు






04/08/2025

పాణ్యం ప్రగతి ప్రదాత.. మన గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

Photos from Telugu Desam Party: Nandikotkur's post 25/07/2025

నిన్నటి రోజున: నందికొట్కూరు మండలం, నాగటూరు గ్రామంలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు,

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు గ్రామంలో ఇంటింటికీ తిరిగి ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. అలాగే గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
#ఇంటింటికీసుపరిపాలన


#సుపరిపాలనలోతొలిఅడుగు

Photos from Telugu Desam Party: Nandikotkur's post 25/07/2025

కొత్తపల్లి మండలో ఎంపిడిఓ నందు ఏర్పాటు చేసిన గ్రీవెన్సెస్ ( ప్రజాపిర్యాదుల స్వీకరణ ) కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి సమస్యల వినతులను స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి సంబందిత అధికారులతో చర్చించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు.

కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొనడం జరిగినది.

#ఇంటింటికీసుపరిపాలన #సుపరిపాలనలోతొలిఅడుగు

08/02/2025

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో ఇకపై పిల్లలకు సన్నబియ్యం వడ్డించాలన్న మంత్రి లోకేష్ గారి ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అలాగే పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం అనుకుంటోంది. ఈ నేపథ్యంలో అవసరమైన ప్రణాళికల్లో భాగంగా సన్నరకం వరి సాగును ప్రత్యేక బోనస్ ఇచ్చి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.



28/01/2025

మాదిగ జాతి పోరాట సింహం, అలుపెరుగని ఉద్యమ కిరణం, అనేక ఆటుపోటులను అధిగమించి, జాతి ప్రయోజనం, ప్రగతి కోసం తన జీవితాన్ని అంకితం చేసి, జాతికి అవసరమైన ఫలాలను అందించిన మాదిగల గుండె చప్పుడు, శ్రీ మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ దక్కడం చాలా సంతోషదాయకం..

పద్మశ్రీ అవార్డు అందుకోనున్న మందకృష్ణ మాదిగ అన్నకు ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

Want your business to be the top-listed Government Service in Nandikotkur?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Nandikotkur Consens
Nandikotkur
518401